ఇసుక క్వారీ లను తెరిపించాలి

రేపల్లె నియోజక వర్గం భవన నిర్మాణ కార్మికుల సంఘం
AITUC ఆధ్వర్యంలో పెనుముడి, ఓలేరు ,జువ్వాలపాలెము, మరియు రాష్ట్ర వ్యాపితం గా ఉన్న ఇసుక క్వారీ లను తెరిపించి కార్మికులకు ఉపాధి చూపించాలని పట్టణ వీధులలో భారీ ప్రదర్శన నిర్వహించి MRO గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో AITUC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.వెలుగూరి రాధాకృష్ణ మూర్తి గారు ధర్నా ను ఉద్దేశించి ప్రసంగిస్తూ  ఈ నెల 25,26 తేదీల లో విజయవాడలో జాతీయ సెమినార్ లో దేశవ్యాప్తం గా ఇసుక పాలసి ని రూపొందిచాలని,భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ పరిరక్షణ, కార్మికుల భద్రత గురించి చర్చించడం జరుగుతుందని చెప్పారు
ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి P..సత్యనారాయణ,AITUC జిల్లా అధ్యక్షుడు P. నాగాజనేయులు,ఏరియా కార్యదర్శి.K.రమేష్, G. శివయ్య, శ్రీనివాసరావు,P. వెంకటేశ్వరరావు, పఠాన్ గౌస్,Cpi ఏరియా కార్యదర్శి G. బాలజీ,శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ D. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్