సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

 రేపల్లె మండలం. సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ సిపిఎం రేపల్లె డివిజన్ కమిటీ సభ్యులు కె. శరత్ అధ్యక్షతన జరిగింది.కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ ప్రారంభంలో దివి.సాయిబాబు చిత్రపటానికి సీపీఎం సీనియర్ నాయకులు ఏవిపికె.సుబ్రమణ్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ కామ్రేడ్ దివి. సాయిబాబు రేపల్లె ప్రాతంలో కార్మిక,వ్యవసాయకార్మిక,రైతు,చేనేత కార్మికులు ఉద్యమాల్లో పనిచేసినా వ్యక్తి అన్నారు.అనేక ప్రజా సమస్యలపై ప్రజల్లో పనిచేసినా ఉద్యమా నేత అన్నారు.సాయి బాబు ఆనారోగ్యం ఉన్నపటికీ ప్రజల్లో ఉండి చివరి వరకు ఎర్రజండాని విడవని ఆదర్శప్రాయడు,సాయిబాబు గారు చిన్న వయసులో ఆకాలంగా చనిపోవటం రేపల్లె ప్రాంత  ఉద్యమాన్నికి లోటు అన్నారు.నేడు దేశంలో బీజేపీ పెద్ద ఎత్తున కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ కష్టజీవులుకి నష్టం కలిగించే విధనాలును ముందుకు తెస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదా లాంటి విషయాలు పక్కనపెట్టి ఉన్న ఉద్యోగాలు తీసివేస్తూ కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు,రాబోయే కాలంలో ఐక్య పోరాటాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీద పోరాటాలుకి సిద్దం అవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కె.శరత్,జి.ధర్మరాజు,వి.కోటేస్వరరావు,కే.ప్రసాద్,  పి.వీణాదేవి,బి.ఆర్య, డి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు




Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్