Posts

Showing posts from August 15, 2019

మదర్సాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

Image
మదర్సాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు రేపల్లె పట్టణంలోని 26వ వార్డులో గల మదర్సా ఎ సుల్తానియా ఫైజాన్ ఎ గౌసె ఆజంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రేపల్లె పట్టణ సిఐ ఎస్ సాంబశివరావు, పట్టణ ఎస్ఐ ఎంవి చరణ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ మదర్సాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరం అన్నారు. జండా వందనానికి తనను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లల్లో బాల్యం నుంచే దేశభక్తిని పెంపొందించాలని చెప్పారు. మదర్సా అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని చెప్పారు.అనంతరం పట్టణ సిఐ. ఎస్ఐ లు హజరత్ సయ్యద్ సుల్తాన్ షా ఖాదరీ హనఫీ సూఫీ ఔలియా దర్గాను దర్శించుకున్నారు. దర్గా నిర్వాహకులు వారికి సంప్రదాయ తలపాగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మదర్సా ప్రిన్సిపాల్  హఫీజ్ మహ్మద్ సయీద్ అన్వర్, జామియాపెద్ద మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ జీలాని , ముస్లిం పెద్దలు షేక్ మస్తాన్, సుభాన్ , ఇబ్రహీం , షేక్ జాఫర్ సాదిక్ , ఖలీల్ , హుస్సేనా , సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.