ముంపు ప్రాంతం లోని వ్యక్తిని కాపాడిన రేపల్లె రూరల్ సిఐ శ్రీనివాసరావు

ముంపు ప్రాంతం లోని వ్యక్తిని కాపాడిన రేపల్లె రూరల్ సిఐ శ్రీనివాసరావు.వెంటనే తమ వాహనంలో ఆసుపత్రికి  తీసుకువెళ్లి దగ్గరుండి వైద్యం చేయించిన సిఐ శ్రీనివాసరావు పట్ల ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
భట్టిప్రోలు మండలం ఓలేరు పంచాయతీ పల్లెపాలెం గ్రామంలో వరదకి మునిగిపోయి ఉండటం తెలిసిందే ఆ గ్రామంలోని కుటుంబాలు కరకట్ట మీద గూడరాలు వేసుకొని నివాసముంటున్నారు. ముంపు గ్రామాల్ని పర్యవేక్షించి  క్రమంలో రేపల్లె రూరల్ సీఐ శ్రీనివాస రావు పల్లెపాలెం గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడే క్రమంలో నాగిడి ధర్మయ్య  ఒక్కసారిగా తన బావ చనిపోయిన బాధలో అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో గ్రామస్తులందరూ విలవిలలాడిపోతూ ఏమైందో తెలియని పరిస్థితుల్లో వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు ఇది తెలుసుకున్న సిఐ శ్రీనివాసరావు  వెంటనే తన  వాహనంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రావడంతో  ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్