|
ప్రశ్నా పత్రంతో సీపీఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు |
|
పరీక్ష రాస్తన్న అభ్యర్ధులు |
రేపల్లె పట్టణంలో కోస్టల్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఉద్యోగ అభ్యర్థులుకు నమూనా పరీక్ష....రేపల్లె విశాఖ కాలేజీలో నిర్వహించిన ఈ నమూనా పరీక్ష పేపర్లను ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.మణిలాల్,కోస్టల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కే.అర్జునరావు,ఎస్ఎఫ్ఐ రేపల్లె డివిజన్ కార్యదర్శి బి.ఆర్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో నిరుద్యోగులలకు గ్రామ సచివాలయం ఉద్యోగలు నోటిఫికేషన్ విడుదల చేయటం హర్షణీయం.రేపల్లె పట్టణంలో తీరప్రాంత నిరుద్యోగులు కోసం కోస్టల్ కోచింగ్ సెంటర్ నమూనా పరీక్ష నిర్వహించటం అభినందనీయం.గ్రామ సచివాలయం పోస్టుల్లో ఎటువంటి ఆవకతవకలు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించాలన్నారు.కోస్టల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె. అర్జనరావు మాట్లాడుతూ 50 మంది నిరుద్యోగులు ఈ నమూనా పరీక్షను ఉపయోగించుకొన్నారు.ఈ నమూనా పరీక్షల్లో పాల్గొన్నవారు ఇంకా కష్టపడి చదివి ఉద్యోగాలు సాదించలాన్నారు.
Comments
Post a Comment