కృష్ణా నది పరివాహ ప్రాంతాలైన కొల్లూరు ,కొల్లిపర ,భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో ఇరవై ఒక్క గ్రామాల్లో వరదనీరు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తమైన అధికారులు. పదకొండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిహెచ్చరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి .పెనుముడి, ఓలేరు ఘాట్ వద్ద వరద నీరు ప్రవాహం ఎక్కువగా వస్తున్నది.
రేపల్లె నియోజక వర్గం భవన నిర్మాణ కార్మికుల సంఘం AITUC ఆధ్వర్యంలో పెనుముడి, ఓలేరు ,జువ్వాలపాలెము, మరియు రాష్ట్ర వ్యాపితం గా ఉన్న ఇసుక క్వారీ లను తెరిపించి కార్మికులకు ఉపాధి చూపించాలని పట్టణ వీధులలో భారీ ప్రదర్శన నిర్వహించి MRO గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో AITUC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.వెలుగూరి రాధాకృష్ణ మూర్తి గారు ధర్నా ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ నెల 25,26 తేదీల లో విజయవాడలో జాతీయ సెమినార్ లో దేశవ్యాప్తం గా ఇసుక పాలసి ని రూపొందిచాలని,భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ పరిరక్షణ, కార్మికుల భద్రత గురించి చర్చించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి P..సత్యనారాయణ,AITUC జిల్లా అధ్యక్షుడు P. నాగాజనేయులు,ఏరియా కార్యదర్శి.K.రమేష్, G. శివయ్య, శ్రీనివాసరావు,P. వెంకటేశ్వరరావు, పఠాన్ గౌస్,Cpi ఏరియా కార్యదర్శి G. బాలజీ,శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ D. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
రేపల్లె మండలం. సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ సిపిఎం రేపల్లె డివిజన్ కమిటీ సభ్యులు కె. శరత్ అధ్యక్షతన జరిగింది.కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ ప్రారంభంలో దివి.సాయిబాబు చిత్రపటానికి సీపీఎం సీనియర్ నాయకులు ఏవిపికె.సుబ్రమణ్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ కామ్రేడ్ దివి. సాయిబాబు రేపల్లె ప్రాతంలో కార్మిక,వ్యవసాయకార్మిక,రైతు,చేనేత కార్మికులు ఉద్యమాల్లో పనిచేసినా వ్యక్తి అన్నారు.అనేక ప్రజా సమస్యలపై ప్రజల్లో పనిచేసినా ఉద్యమా నేత అన్నారు.సాయి బాబు ఆనారోగ్యం ఉన్నపటికీ ప్రజల్లో ఉండి చివరి వరకు ఎర్రజండాని విడవని ఆదర్శప్రాయడు,సాయిబాబు గారు చిన్న వయసులో ఆకాలంగా చనిపోవటం రేపల్లె ప్రాంత ఉద్యమాన్నికి లోటు అన్నారు.నేడు దేశంలో బీజేపీ పెద్ద ఎత్తున కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ కష్టజీవులుకి నష్టం కలిగించే విధనాలును ముందుకు తెస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదా లాంటి విషయాలు పక్కనపెట్టి ఉన్న ఉద్యోగాలు తీసివేస్తూ కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు,రాబోయే కాలంలో ఐక్య పోరాటాలు కేంద్ర,ర
యుద్ధ విమానం తేజాస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్లో పైలట్ వెనుక సీటులో కూర్చున్న రాజ్నాథ్ సింగ్ హెల్మెట్ ధరించి, ఆక్సిజన్ మాస్క్తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్లోని హాల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా ఉన్నానని రాజ్నాథ్ సింగ్ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. తేజాస్ యుద్ధ విమానంలో పర్యటించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ పేరిట రికార్డ్ నమోదైంది.పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్లో విహారం ఆస్వాదించానని, తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ కొనుగోలుకు ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. కాగా ఈ ఏడాది జనవరిలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సుఖోయ్ 30 యుద్ధ విమానంలో జోథ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేఫన్ సుంచి 45 నిమిషాల పాటు ప్రయాణించారు.
Comments
Post a Comment